
తెలంగాణ శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం 300 కోట్లు దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ నెల 9 నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, కానుకల విలువ 307 కోట్ల రెండు లక్షలకుపైగా ఉన్నట్లుతెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గత 24 గంటల్లో 9.69 కోట్ల నగదు పట్టుబడగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు 105.58 కోట్ల రూపాయలు. గత 24 గంటల్లో కోటీ 35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ 13.58 కోట్లు. 24 గంటల్లో 72 లక్షల విలువైన..232 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు మొత్తం 15.23కోట్ల విలువైన..3వేల 672 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం విలువ..145.67 కోట్ల రూపాయలు. 26.93 కోట్లు విలువైన ఇతర కానుకలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com