
By - Sathwik |3 Dec 2023 1:00 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పలువురు అధికారులు తరలివెళ్తున్నారు. డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ , అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన్ను మద్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com