By - Bhoopathi |13 July 2023 3:30 AM GMT
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వీ భట్టిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సంప్రదించిన తర్వాత వారిద్దరినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజా కేంద్రం నిర్ణయంతో తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com