
By - Bhoopathi |20 Jun 2023 9:00 AM IST
కోర్టు ధిక్కరణ కేసులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంకు కేసులో ఆదేశాలు పాటించనందుకు ఈ నోటీసులు పంపించింది. పాలన వ్యవహారాలకు అధికారిని నియమించాలని గతంలో ఆర్బీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు కాలేదని మహేశ్ బ్యాంకు వాటాదారులు కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు స్పందించిన న్యాయస్థానం కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై జులై 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com