ఏపీ సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ చేశారు. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది. పిల్కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com