
హైదరాబాద్ మియాపూర్లో భారీగా బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వనస్థలిపురంలో ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపుర్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.32 లక్షల నగదు పట్టుబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com