
By - Chitralekha |17 Aug 2023 2:40 PM IST
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు తెల్లం వెంకట్రావు తిరిగి గులాబీ కండువా కప్పుకోనున్నారు. మంత్రుల సమక్షంలో బీఆర్ఎఎస్లో చేరనున్నారు. దీంతో పొంగులేటి శిబిరంలో గుబులు మొదలైంది. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయంటూ సంకేతాలు ఇస్తోంది. తెల్లం వెంకట్రావు 2018 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పొంగులేటితో పాటే కాంగ్రెస్లో చేరారు. భద్రాచలం టికెట్ పై మంత్రులు భరోసా ఇచ్చిన నేపధ్యంలో ఆయన తిరిగి తన మద్దతు దారులతో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com