టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌ నెలకొంది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వార్నింగ్‌ ఇచ్చారు. ఆందోళన ఆపేయకుంటే అరెస్ట్‌ చేస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అందర్నీ అరెస్ట్‌ చేస్తామని.. మిమ్మల్ని అరెస్ట్‌ చేయడం తమకు పెద్ద పనేం కాదన్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని కోదండరాం కోరితే గంట పర్మిషన్‌ ఇచ్చామని డీసీపీ తెలిపారు. మూడు గంటలుగా అభ్యర్ధులు ఆందోళన చేస్తున్నారు.

అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఒకేసారి టీఎస్‌పీఎస్సీ ముట్టడికి వందల మంది అభ్యర్థులు వచ్చారు. టీఎస్‌పీఎస్సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బైఠాయించారు. గ్రూప్‌ 2 పరీక్ష రెండు నెలలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేసేంతవరకు అక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 అభ్యర్థులకు మద్దతుగా అక్కడికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ అక్కడికి వచ్చారు. విద్యార్ధుల్ని అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్ కు తరలించారు పోలీసులు

Next Story