By - Chitralekha |19 Aug 2023 9:59 AM GMT
ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మగుంట గ్రామంలో సర్పంచ్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారం ఉందని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com