స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.శ్రీ సత్యసాయి జిల్లా చలివెందులలో వైసీపీ మద్దతుదారుడిని గెలిపించాలని డబ్బులు పంచారు వైసీపీ నేతలు. అయితే పోలీసుల సమక్షంలోనే యధేచ్చగా నగదు పంపిణీ చేస్తున్నా,గుంపులు, గుంపులుగా పోలీంగ్‌ కేంద్రాల్లో తిరుగతున్నా అధికార పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంలేదని మండిపడుతున్నారు స్థానికులు. పోలింగ్‌ బూత్‌ నుంచి ఓటు వేసి బయటకు రాగానే వేయి రూపాయల నగదు పంపిణీ చేశారు మండల వైస్‌ ఎంపీపీ రఘునాథ రెడ్డి. అయితే వైసీపీ నగదు పంపిణీని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

Next Story