
By - Chitralekha |17 Aug 2023 4:43 PM IST
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ కోసం అధికారులు వచ్చారు. అయితే.. ఉపాధి అవకతవకలు జరిగినట్లు ప్రజలు గళమెత్తారు. కొత్తపేటలో వేయని గ్రావెల్ రోడ్ వ్యవహారంలో.. 7 లక్షలు వైసీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. అధికారులకూ ప్రమేయం ఉందని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేయని పనులకు, పనికి హాజరుకాని వారి పేర్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com