Kakinada: ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Kakinada: ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉపాధి హామీ పథకం సోషల్‌ ఆడిట్‌ కోసం అధికారులు వచ్చారు. అయితే.. ఉపాధి అవకతవకలు జరిగినట్లు ప్రజలు గళమెత్తారు. కొత్తపేటలో వేయని గ్రావెల్‌ రోడ్‌ వ్యవహారంలో.. 7 లక్షలు వైసీపీ నేతలు దోచేశారని ఆరోపించారు. అధికారులకూ ప్రమేయం ఉందని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేయని పనులకు, పనికి హాజరుకాని వారి పేర్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Next Story