
By - Chitralekha |1 Aug 2023 1:02 PM IST
విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఉద్యోగస్తులు ఆఫీస్లోకి వెళ్లకుండా కార్యాలయం గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. తమను పర్మినెంట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com