
By - Chitralekha |29 July 2023 4:09 PM IST
రంగల్ పోతననగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు- పోలీసుల మధ్య తోపులాటతో రణరంగంగా మారింది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళుతున్న.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అనుచరులు పురుషోత్తం, అనిల్ను సీఐ చితకబాదారు. పోలీసుల వైఖరిపై రాకేష్రెడ్డి మండిపడ్డారు. బాధిత ప్రజలకు సహాయం చేస్తే తప్పేంటని నిలదీశారు. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం కూడా నేరమేనా అని పోలీసుల్ని ప్రశ్నించారు. భద్రకాళి చెరువుకు గండి పడటంతో పోతననగర్ ప్రమాదంలో ఉందని రాకేష్రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com