
By - Vijayanand |20 Aug 2023 1:52 PM IST
అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ఇంటి ముందు ప్రభుత్వ కాలేజీ ప్రహరీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.. పునాదుల కోసం తవ్విన గోతులను గుర్తుతెలియని వ్యక్తులు.. రాత్రికి రాత్రే పూడ్చేశారు. మరోవైపు జేసీ ఇంటికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.. ఘటనాస్థలంలో 30 యాక్ట్ అమలులో ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతలపై కక్షలో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు పనులు చేపట్టారని జేసీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com