
By - Vijayanand |31 Aug 2023 11:57 AM IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ బాలుడు మురికి నీటి సంపులో పడి చనిపోయాడు. బాలుడు షాద్ నగర్ పరిధిలోని నందిగామకు చెందిన అభిజిత్ రెడ్డిగా గుర్తించారు. బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫంక్షన్ హాల్ ఆవరణలోని మురికి నీటి సంపులో బాలుడి మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com