
By - jyotsna |24 Jun 2025 6:45 AM IST
పాకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానాలకు మన గగనతల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విమానాలకు గగనతల నిషేధాన్ని విధిస్తూ ఏప్రిల్ 30న కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని పొడిగిస్తూ వస్తున్నది. మరోవైపు, పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగగతల నిషేధాన్ని పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఏప్రిల్ 24న గగనతల నిషేధాన్ని విధించింది
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com