By - Bhoopathi |26 Jun 2023 10:15 AM GMT
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాట రేటు అమాంతంగా పెరిగింది. ఊహించని రీతిలో పంటకు ధర పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కొన్ని నెలలుగా గిట్టుబాటు రేటు లేక విలవిల్లాడుతున్న రైతులు, వారం క్రితం వరకు కిలో టమాట ధర 10రూపాయలు కూడా పలకకపోవడంతో ఆవేదన చెందారు. అయితే అన్యూహ్యంగా రేటు 70 నుంచి 80 రూపాయల వరకు పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాక్పట్ విధానం రద్దుతో రైతులకు అదనపు ఆదాయం కూడా రావడంతో వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com