By - Chitralekha |23 Aug 2023 7:04 AM GMT
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో సినీఫక్కీలో చోరీ జరిగింది. కారును వెంబడించి పోలీసుల పేరుతో రెండు కోట్ల నగదును తీసుకెళ్లారు దుండగులు. ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థకు చెందిన 2కోట్ల రూపాయల్ని సంస్థ మేనేజర్ శ్రీపతి అనుపకుమార్ హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కారును ఆపి లాఠీలను చూపించి నగదు తీసుకెళ్లినట్లు చెప్పారు. అసలు విషయం తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదును బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com