Naveen Patnaik: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సెటైర్

Naveen Patnaik: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సెటైర్

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ఆయా రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకోవాలని హితవు చెప్పారు. బీజేపీ నేతలను రాజకీయ పర్యాటకులు అని అభివర్ణించారు. ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అధికార బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పెరిగింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్ గఢ్, హర్యానా, అసోం రాష్ట్రాల సీఎంలు ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని హామీలు గుప్పించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఒడిశాలో కంటే అసోంలో తలసరి అప్పు రెట్టింపు అని, మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండని సూచించారు. తమ పార్టీ నేతలను పొలిటికల్ టూరిస్టులు అని నవీన్ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు.

Next Story