
By - Vijayanand |19 Aug 2023 1:24 PM IST
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కొత్తూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం వరకు పార్వతీపురం మన్యం జిల్లా కాట్రగడ్డ పరిసర ప్రాంతాల్లో తిరిగిన పులి.. శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. కొత్తూరు మండలంలోని ఈతమనుగూడ, కారిగూడ, దొండమామిడి గూడ, బాండ్రుగూడ ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com