
By - Bhoopathi |6 July 2023 1:00 PM IST
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు పెరిగిపోవడంతో దోపిడీ దొంగలు రూటు మార్చారు. విలువనై టమోటా పంటను లూటీ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన సోమశేఖర్ అనే రైతు పంటను దోపిడీ దొంగలు కొల్లగొట్టారు. హాసన్ జిల్లా హాలిబీడు సమీపంలోని గోని సోమనహళ్ళి అనే గ్రామానికి చెందిన సోమ శేఖర్ రైతు పొలంలో రవాణాకు సిద్ధంగా ఉన్న పంటను ఎత్తుకెళ్లారు. సుమారు 90 బాక్సుల టమోటాలు చోరీ అయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సోమశేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com