By - Vijayanand |17 July 2023 11:13 AM GMT
దేశ వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. నెలరోజుల్లోనే ఇద్దరు రైతులను కోటీశ్వరులను చేశాయి. మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్ 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్గంజ్ మార్కెట్లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com