
By - Chitralekha |22 July 2023 4:20 PM IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు మండలంలోని జలపాతాలు కనువిందు చేస్తుండగా.. ఎన్టేరు వాగు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. నానాజీపూర్ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నురుగులతో మెలికలు తిరుగుతూ జలజల పారుతున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. సందర్శకుల తాకిడి పెరగడంతో నానాజీపూర్ వాటర్ ఫాల్స్ వద్ద అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com