By - Vijayanand |9 July 2023 12:17 PM GMT
అల్లూరి జిల్లాలో వైసీపీపై గిరిజనులు తిరగబడ్డారు. కూనవరంలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగ సభను అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. కూనవరం టేకులబోరు నుంచి కూనవరం వరకు అఖిలపక్షనాయకులు ర్యాలీ నిర్వహించారు. కూనవరం జంక్షన్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత హంతకుడు అనంతబాబు అంటూ విపక్ష నాయకులు నినాదాలు చేశారు. అనంతబాబుకు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో గిరిజనులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com