YSRCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ

YSRCP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం అంపురాం గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతికి నిరసన సెగ తగిలింది. గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అంపురాం వెళ్లిన ఎమ్మెల్యేను స్ధానిక గిరిజనులు నిలదీశారు. గ్రామానికి సరైన రోడ్లు, మంచినీటి కులాయిలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలుగేళ్లుగా గ్రామంలో ఉన్న సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే వచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు చొరవదీసుకుని గిరిజనులను అడ్డుకున్నారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story