
By - Sathwik |14 Oct 2023 7:00 AM IST
తెలంగాణలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన TRTని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 5వేల 89 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వరకు టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆరు రోజులు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో ఎన్నికలున్నందున తర్జనభర్జనపడిన అధికారులు ఎట్టకేలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com