By - Vijayanand |5 Aug 2023 6:36 AM GMT
ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్ పెట్టడాన్ని నిరసిస్తూ.. టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు. బంద్లో భాగంగా డిపోల ముందు ధర్నాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా బీజేపీ వైఖరి ఉందని కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు.గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసనలకు దిగారు. హయత్ నగర్ డిపో ల్లోని బస్సులు బయటికి కదల్లేదు. ఉప్పల్ డిపో ముందు ఉదయాన్నే ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com