ఆర్టీసీ విలీనం.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్

ఆర్టీసీ విలీనం.. గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ ఫైర్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గవర్నర్ సమ్మతి కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనకు పంపింది. అయితే రెండ్రోజులైనా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గవర్నర్ సమ్మతి కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు.

Next Story