By - Bhoopathi |17 July 2023 5:45 AM GMT
కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు హైవేపై టిఫిన్ సెంటర్ నడుపుతున్న 55 ఏళ్ల సత్యవతిని ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన సత్యవతిని తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. ఈ హత్యకు ముందు దుండగులు ఓ ఆటో డ్రైవర్ పై దాడి అతని ఆటోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com