
By - Vijayanand |25 Aug 2023 12:42 PM IST
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటనలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల దూరానికే రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన కోసం వస్తున్న జగన్ కోసం.. మెంటాడ మండలం చిన మేడపల్లి వద్ద ఒక హెలిప్యాడ్ను… 4 కిలో మీటర్ల దూరంలోని దత్తి రాజేరు మండలంలో మరొక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కేవలం 4 కిలో మీటర్ల దూరానికే రెండు హెలీప్యాడ్లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com