By - Bhoopathi |26 Jun 2023 12:15 PM GMT
నల్గొండలోని బర్కత్ పూరా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ స్టోరేజ్లో ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పండ్ల కోల్డ్ స్టోరేజీలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు దాడికి శరీర భాగాలు చింద్రమైపోయాయి. మృతులు కోల్డ్ స్టోరేజ్ ఓనర్ షేక్ కలీమ్, అందులో పని చేసే సాజిద్గా గుర్తించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com