By - Vijayanand |30 Jun 2023 12:27 PM GMT
ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా మరిన్ని అడుగులు పడ్డాయి. జులై 3న న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని..న్యాయమంత్రిత్వ శాఖ, లా కమిషన్ అధికారులకు పిలుపు వెళ్లింది.దేశంలోని పౌరులకు ఒకే చట్టం ఉండాలని..మత ప్రాతిపదికన చట్టాలు ఉండరాదని ప్రధాని మోదీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టంపై ఇప్పటికే లా కమిషన్ ప్రజాభిసేకరణను ప్రారంభించింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి చట్టం బీజేపీ అజెండాలో ప్రధానాంశంగా ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com