రైల్వే పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు

రైల్వే పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కనీసం సమావేశానికి ఉన్నతాధికారులను కూడా పంపడం లేదని ఆరోపించారు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు.. సమావేశంలో హైదరాబాద్‌లోని పాఠశాలలో వసతుల కల్పనపై చర్చించారు.. కొన్ని పాఠశాలలకు విద్యుత్ సరఫరా నిలిపివేతపై కిషన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగొద్దన్నారు. దిశా మిటింగ్‌కు హాజరుకాని అధికారులపై కేంద్రానికి లేఖ రాస్తానని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

Next Story