విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జాబ్‌మేళాలో ఉద్రిక్తత

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో జాబ్‌మేళాలో ఉద్రిక్తత

విశాఖపట్నంలో వివాదాస్పద ఐటీ కంపెనీ వి.ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాను AIYF కార్యకర్తలు అడ్డుకున్నారు. గతంలో నిరుద్యోగులను వి.ఇన్ఫోటెక్ కంపెనీ మోసం చేసిందని ఆరోపించారు. మోసపోయిన నిరుద్యోగులు జాబ్‌మేళాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా AIYF కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకుడు మారుతి ప్రసాద్‌కు చెందిన వి.ఇన్ఫోటెక్ కంపెనీ గతంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు మోసం చేసిందని AIYF నేతలు ఆరోపించారు. నిరుద్యోగుల నుంచి వేలాది రూపాయలను కంపెనీ వసూలు చేసిందన్నారు.

Next Story