By - Vijayanand |25 Jun 2023 5:34 AM GMT
ఏపీలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కంతేరు ఘటనపై డీజీపీకి లేఖ రాసిన ఆయన.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంతేరు దళితులపై దాడికి పాల్పడిన వైసీపీ నేత కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు శామ్యూల్పై అత్యంత దారుణంగా దాడి చేయడం అమానుషమన్నారు. దాడి జరిగి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు నేరస్తులపై కేసు నమోదు చేయలేదని ఫైర్ అయ్యారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో వర్లరామయ్య కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com