
By - Subba Reddy |15 Jun 2023 3:15 PM IST
విశాఖలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లు, ఓపెన్ మార్కెట్ అన్న తేడా లేకుండా ధరలు మండిపోతుండటంతో సామాన్యలు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలో నాలుగైదు రకాల కూరగాయలు తప్ప.. మరేవీ లభించడం లేదు. ఎండల ప్రభావం కూరగాయల పంటలపై పడిందంటున్నారు రైతులు.. దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్లలో కొరత ఏర్పడి ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరో వైపు వినియోగదారులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని నిట్టూరుస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com