ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవీ ఉత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవీ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శాకాంబరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.

Next Story