
By - Vijayanand |16 Aug 2023 2:35 PM IST
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో దారుణం జరిగింది. దొంగతనం నెపంతో.. మైనర్ బాలికను చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న మధుకర్ రావు కుటుంబసభ్యులు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలిక కళ్లలో కారం పోసి దారుణంగా చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను పంచాయితీ కార్యాలయం వద్ద కట్టేసి కళ్లలో కారం వేసి తీవ్రంగా కొట్టినట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com