
By - Vijayanand |27 Aug 2023 2:55 PM IST
విశాఖలో జగనన్న బస్ బే కూలిపోయింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా నిర్మించిన ఈ బస్సు బేను..హడావుడిగా నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు. పనులు కూడా పూర్తి కాకుండానే... మేయర్ చేతుల మీదుగా.. దీన్ని ప్రారంభించారు. అయితే.. ఇవాళ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా బస్ బే కూలిపోయింది. కూలిన సమయంలో.. పలువురు ప్రయాణికీలు బస్ బే కింద ఉన్నారు. అయితే విరిగి శబ్దం రావడంతో.. ప్రయాణీకులు తప్పించుకున్నారు. జగననన్న బస్ బేలు కేవలం ప్రచారానికి తప్ప ఎలాంటి నాణ్యత ఉండటం లేదంటు మండిపడ్డారు విశాఖ వాసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com