
By - Bhoopathi |14 July 2023 2:15 PM IST
విశాఖ నగరంలో డెంగ్యూ మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖలోని 4,5,6 జోన్ పరిధిలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తగా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రతను పాటిస్తే డెంగ్యూను కట్టడి చేయవచ్చని జీవీఎంసీ ముఖ్య వైద్య అధికారి నరేష్ కుమార్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com