
By - Chitralekha |28 Aug 2023 3:08 PM IST
గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై వాలంటీర్ల ఫిర్యాదు కలకలం రేపుతోంది. తమను ఎమ్మెల్యే దూషించాడంటూ ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇటీవల మన్నవ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను అభివృద్ధి పనులపై గ్రామస్తులు నిలదీశారు. దాంతో మన్నవ సచివాలయానికి తమను పిలిపించి ఎమ్మెల్యే కిలారి రోశయ్య బూతులు తిడుతూ ఇష్టానుసారం మాట్లాడాని వాలంటీర్లు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి పనులు చేయకుండా అడిగినవారిపై దుర్బాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోశయ్య నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com