
By - Bhoopathi |8 July 2023 8:45 AM IST
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంతో ఓరుగల్లు నిఘా నీడలో వెళ్లింది.వరంగల్ వ్యాప్తంగా పోలీసులు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు.10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధాని భద్రత కోసం ఎస్పీజీ, ఆక్టోపస్, సీఆర్పీఎఫ్, ట్రాఫిక్, సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.ప్రధాని వెళ్లే భద్రకాళీ ఆలయంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 20 కిలోమీటర్ల వరకు నోఫ్లైజోన్గా ప్రకటించారు.144 సెక్షన్ విధించారు.వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ప్రధాని మోదీ పర్యటనలో ప్రతి కిలోమీటర్కు ఒక అదనపు ఎస్పీ బందోబస్తును పర్యవేక్షిస్తుంటారు.ప్రధాని రాక నేపథ్యంలో వరంగల్లో భారీ భద్రత ఏర్పాటు చేశామని సీపీ రంగనాథ్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com