
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. భారత రాజ్యంగం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పునదిగా గుర్తింపు పొందాడాన్ని నమ్ముతామని పేర్కొన్నారు. భారత్-అమెరికా ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహం, సహకారం మన ఆర్థిక సంబంధాలను ముందుకు నడుపుతుందుని విశ్వసిస్తున్నామని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలతో సహా రానున్న సంవత్సరాల్లో మన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com