అదనపు కట్నం కోసమో, మద్యం మత్తులోనో భర్తలు వేధిస్తున్నారని భార్యలు ఫిర్యాదులు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా భార్యనుంచి తనకు ప్రాణహాని ఉంది రక్షించండంటూ ఓ బాధితుడు పోలీసులు వేడుకుంటున్నాడు. APలోని అమలాపురానికి చెందిన టెమూజియన్ మల్లారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ ఆచార్యునిగా పనిచేస్తూ హైదరాబాద్లోని ఆల్వాల్ నివాసం ఉంటున్నాడు. ఏపీలోని రాజోలుకు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం తనకు వివాహం కాగా ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపాడు. పెళ్లైనప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా హింసిస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నాడు. గతంలో పలుమార్లు దాడి చేయగా పెద్దమనుషులు సర్ది చెప్పారని వివరించారు. అయినా తీరు మార్చుకోకుండా ఇటీవల మళ్లీ కత్తితో దాడి చేసిందంటూ గాయాలు చూపించాడు. స్థానిక ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ గోడు వెలిబుచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com