Manipur: మిలిటెంట్లకు అండగా నిలిచిన మహిళలు

Manipur: మిలిటెంట్లకు అండగా నిలిచిన మహిళలు

మణిపూర్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక మహిళలు మిలిటెంట్లకు అండగా నిలిచారు. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నరన్న సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం గ్రామాన్ని చుట్టుముట్టి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకొని మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్మీ వాహనాలను మహిళలు చుట్టుముట్టడంతో కొన్ని గంటల పాటు ఇథమ్‌ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చేసేదేమి లేక 12 మంది మిలిటెంట్లను సైన్యం విడిచిపెట్టాల్సి వచ్చింది.

Next Story