
By - Bhoopathi |13 Jun 2023 1:15 PM IST
జోగులంబ గద్వాల జడ్పీ ఛైర్మన్ కార్యాలయం ముందు మహిళల ఆందోళనకు దిగారు. జడ్పీ ఛైర్మన్ పీఏ పరమేష్ తమను మోసం చేశాడని ఓ మహిళ ఆరోపించారు. తనతో పాటు మరో మహిళలను శారీకంగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జడ్పీ ఛైర్మన్ కార్యాలయం ముందు మహిళా సంఘాలతో కలిసి బాధితులు ధర్నాకు దిగారు. పరమేష్ తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు... బాధితులకు నచ్చజెప్పి స్టేషన్కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com