
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అమానుషకరమైన ఘటన జరిగింది. 13వ డివిజన్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఉంటున్న డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినిపై SN గొల్లపాలెంకు చెందిన వైసీపీ కార్యకర్త ఆవుల సతీష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో ఆ విద్యార్థినితో ఉన్న పరిచయంతో హాస్టల్ లో ఉంటున్న ఆమెను తన బైక్ పై బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెతో మద్యం తాగించడమే కాకుండా డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో విద్యార్థిని హాస్టల్ నుండి తీసుకెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత హాస్టల్ వద్ద వదిలాడు. అనుమానం వచ్చిన వార్డెన్ విద్యార్థిని ప్రశ్నించగా జరిగినదంతా చెప్పింది. దీంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సతీష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com