
By - Chitralekha |14 Aug 2023 3:28 PM IST
నెల్లూరులో టీడీపీపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. చేజర్ల మండలం పాతపాడులో టీడీపీ వార్డు మెంబర్ అభ్యర్థి బైక్ తగలబెట్టారు. నిన్న టీడీపీ తరపున నామినేషన్ వేసిన బాబాసాహెబ్పై దాడి చేశారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని టీడీపీ అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో భౌతిక దాడులకు దిగారు. ఇటీవల ఐదో వార్డు మెంబర్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేత ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com