
By - Chitralekha |28 Aug 2023 3:21 PM IST
విజయవాడ కార్పొరేషన్లో అధికార పార్టీ నేతల అవినీతి బట్టబయలు అయింది. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్లో డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామంటూ మరికొందరు నేతులు అడ్డంగా దోచేస్తున్నారని విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై నజర్ పెట్టి భారీ డబ్బులు వసూలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. వాటల పంపిణీలో తేడాలు రావడంతో స్వంత పార్టీనేతలే ఒకరి బాగోతం ఒకరు బయట పెట్టుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com