
By - Vijayanand |7 July 2023 11:06 AM IST
గుంటూరు మార్కెట్ సెంటర్లో అతి వేగంతో వచ్చిన ఓ వైసీపీ నేత స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయినట్టుగా చెబుతున్నారు. ఈ వాహనం గుంటూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కళ్లెం హరికృష్ణ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. గతంలో పరిటాల శ్రీరామ్పై అనంతపురంలో వీడియో చేసిన కల్లం హరికృష్ణ రెడ్డి. కంతేరులో జరిగిన దళితులపై దాడిలో కూడా ప్రధాన వ్యక్తిగా చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com